నవీనము

5, జనవరి 2016, మంగళవారం

తెలివితక్కువ వాళ్లను ఐదుగురిని వెదికి పట్టుకొ


ఒకానొక రాజ్యంలో, రాజుగారు తన మహామంత్రిని పిలిపించాడు.

రాజు : " రాజ్యంలో మహా తెలివైనవారు వున్నట్లే, మహా తెలివితక్కువ వాళ్లూ వుంటారు కదా ?"


మంత్రి (సంశయిస్తూనే): " అవును . వుంటారు ప్రభూ!"

రాజు : " ఐతే, మన రాజ్యం అంతా గాలించి, అందరిలోకీ అతి తెలివితక్కువ వాళ్లను ఐదుగురిని వెదికి పట్టుకొని, ఇక్కడ సభలో హాజరు పరచండి." అని ఆదేశించాడు.

మంత్రి " చిత్తం ప్రభూ" అని సభనుండి నిస్క్రమించాడే కానీ మనసంతా ఎలా అన్న ఆలోచనలతోనే మస్తిష్కమంతా నిండి పోయింది

కొన్ని పరీక్షలు పెట్టో ప్రశ్నలు అడిగో తెలివయిన వాడో కాదో తెలుసుకోవచ్చు. మరి తెలివితక్కువ వాడినెలా గుర్తించాలి? ఈ సందిగ్దావస్త నుండి బయటపడటమెలాగో అర్ధం కావటంలేదు మంత్రిగార్కి. ఒప్పుకున్నాక తప్పదుగా! రారాజ్ణ మరి. ఒక నెల రోజులపాటు రాజ్యమంతా తిరిగి ఇద్దరిని పట్టుకుని సభలో హాజరు పరిచాడు.

రాజుగారు : " మహామంత్రీ! మీరు పొరబడినట్లున్నారా లేక లెక్క తప్పారా? మేను ఐదుగురిని ప్రవేశపెట్టమన్నాము. కానీ తమరు ఇద్దరిని మాత్రమే వెంట తీసుకొనివచ్చారు"

మహామంత్రి " మహా ప్రభూ! తమరు నేను చెప్పేది కొంచెం ఆలకించండి"

రాజు " సరే సెలవియ్యండి"

మంత్రి :" నేను రాజ్యమంతా తిరిగాడుచుండగా ఇతను ఒక ఎడ్లబండి మీద కూర్చొని తలపై ఒక పెద్దమూటను పెట్టుకొని వెళుతూ కనిపించాడు. అలా ఎందుకు అని అడుగగా, అయన్ను అడుగగా తలపైనున్న మూట, బండి మీద పెడితే ఎడ్లకు భారమవుతుంది అని సమాదానమిచ్చాడు. అందుకే అతను అయిదవ తెలివితక్కువ వాడిగా తీసుకొచ్చాను"

రాజు " భేష్! తరువాత"

మంత్రి :" ఈ రెండో అతను ' తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి, తన గేదెను ఇంటి పైకప్పు మీదకు లాగుతూ కనిపించాడు" కావున ఇతన్ని నాల్గవ తెలివితక్కువ వాడిగా ప్రవేశపెట్టాను"

రాజు : " బహు బేషుగ్గా వుంది. తరువాత"

మంత్రి : " రాజ్యంలో చాలా సమష్యలుండగా, వాటినన్నింటినీ ప్రక్కనపెట్టి, తెలివితక్కువ వాళ్లను వెదకటంలో నెల రోజుల పాటు సమయం వృధాచేసాను. కాబట్టి నేను ..... మూడవ తెలివితక్కువ వాడిని."

రాజు ( గట్టిగా నవ్వుతూ ) " తరువాత "

మంత్రి : " పరిష్కరించాల్సిన సమస్యలుండగా, బాద్యతలన్నీ విస్మరించి, తెలివితక్కువ వాళ్ల కోసం వెదుకులాడుతున్న తమరు ..... రెండో వారు"

అది విన్న సభలొని వారంతా నిశ్టేత్తులై బయబ్రాంతులై చూస్తుండిపొయారు. నిశ్సబ్దం ఆవరించింది సభలో.

రాజుగారు తేరుకుని కుతూహలం తో " మంత్రి గారు సందేహం లేదు. మీరు సెలవిచ్చినదాంట్లో వాస్తవానికి దగ్గరగానూ నిశ్సందేహంగా నిజాయితో కూడిన నిజముంది. మరి మీరు మెదటి తెలివితక్కువ వారెవరో తెలియచెప్పండి"

మంత్రి : " చిత్తం మహా ప్రభో! తమ కార్యాలయాల్లొనూ ఇంట్లొనూ చెయ్యవలసిన పనులన్నీ మానుకొని, ఈ పోస్ట్ ని చదువుతున్నవాడే ... ఆ మొదటివాడు."

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy