నవీనము

5, జనవరి 2016, మంగళవారం

“ఎవడు చేసిన కర్మవాడనుభవించాలి”


పూర్వం ఒకతను హుబ్లి స్టేషన్లో రైలు ఎక్కాడు,
రైల్లో జనం కిక్కిరిసి ఉన్నారు,
కూర్చోడానికి ప్లేస్ లేదు,
సంచిలో నుంచి ఒక 'ప్లాస్టిక్ పాము' ఒకటి తీసి
పాము ..... పాము అని అరిచాడు అందరు దిగిపోయారు.........
అందరు దిగిపోయారు కదా హమ్మయ్య అని ఒక బెర్త్ ఎక్కి పడుకున్నాడు, పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది. మర్నాడు ఉదయం అయ్యింది, అబ్బా ఒక్కడు లేడురా బోగీలో, ఒక్క రబ్బరు పాముకే అందరు దిగిపోయారు, హాయిగా పడుకున్న బోగీలో అని, ఆవలిస్తూ దిగి ఇదేనా బెంగళూరు అని అడిగాడు, ఇది హుబ్లి అన్నారు, అదేంటి రాత్రి పడుకున్నా కదా వెళ్ళలేదా అన్నాడు, అందులో పాముందన్నారు కదా అదెక్కడో దూరి పోయింది దొరకలేదు పామని ఆ బోగిని తీసేసి వేరే బోగిని తగిలించుకొని వెళ్ళిపోయారు.


నీతి - “ఎవడు చేసిన కర్మవాడనుభవించాలి”

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy