మనమొక తెలియని ప్రదేశానికి వచ్చామనుకుందాం. అక్కడ మన స్నేహితుని ఇంటి చిరునామా మన దగ్గర వుంది కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. ఆ ఊరివారిని ఒకరిని ఆ ఇంటికి ఎలా వెళ్ళాలో అడుగుతాము. అతడు మనకు త్రోవ చెప్పాడనుకుందాం. అతడు నిజము చెప్పవచ్చు, లేక తప్పు చెప్పవచ్చు. కానీ ఆ ప్రయాణం సాగించనిదే ఆ చోటకు వెళ్ళనిదే అతడు సత్యం పలికాడా లేదా అన్నది రూడీ కాదు. ఆ అపరిచిత వ్యక్తి స్వభావం ఎలాంటిది , నమ్మదగినవాడా, కాదా, అతడికి నిజంగా తెలుసా లేదా అన్న మీమాంసలు పక్కన పెట్టి నువ్వు చేరవలసిన చోటు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తావు. తప్పు చోటుకు చేరితే అప్పుడు అతనిని తప్పు పట్టవచ్చు. కానీ అతడు చెప్పిన దారిలో పయనించెంత వరకు అతడు చెప్పిన దాని మీద నమ్మకంతో కదలాలి.
భగవంతుని చేరడానికి దారి చెప్పిన పురాణ ఋషులను విశ్వసించకుండా ఉండడానికి కారణం లేనప్పుడు వారి మాటలను పూర్తిగా విశ్వసించేందుకు సిద్ధపడాలి. వారి మాటలను అనుసరించి యత్నించి చివరకు ఆ మాటలు సత్యములు కాకపోతే అప్పుడు వారి యందు తప్పు చూపవచ్చును. అప్పటివరకు తప్పు పట్టే హక్కు నీకు లేదు.
--శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర భారతీ మహాస్వామి వారు, శృంగేరి
!! ఓం నమో వేంకటేశాయ !!
కామెంట్ను పోస్ట్ చేయండి