ఒక లాయరు గారు ఒక్కడే రైలు లో ప్రయాణిస్తున్నారు...
ఆయన ప్రయాణిస్తున్న భోగీ AC II Tier. పైగా చలికాలం కావడం వలన ఆయన ఉన్న portion చుట్టుపక్కల జనం ఎవరూ లేరు..
ఇంతలో అక్కడకి ఒకమ్మాయ్ వచ్చి...
" మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేయ్.. లేకపోతే, నన్ను నువ్వు ' ఏదో ' చేయబోయావని అరచి గోల చేస్తా.." అన్నది...
ఆ లాయరు గారు ఏం మాట్లాడకుండా, ఒక కాగితం తీసి ఏదో రాసిచ్చాడు.....
అందులో ఇలా ఉంది.." అమ్మా, నేను పుట్టూ చెవిటి, మూగ వాణ్ణి...మీరు చెప్పింది నాకు అర్ధం కాలేదు. కాస్త ఈ కాగితం మీద వ్రాసి ఇస్తారా?"
ఆ అమ్మాయ్ ఆ కగితం తీసుకుని తని చెప్పిందంతా వ్రాసి ఇచ్చింది...
ఆ కాగితం తీసుకుని, జేబులో పెట్టుకున్న లాయరు గారు.....
" ఆ చెప్పమ్మా.. ఇందాక ఏదో అంటున్నావ్.. ?" అంటూ మొదలెట్టారు....
కామెంట్ను పోస్ట్ చేయండి