30 ఏళ్ళ వయస్సులో నవ యువ సన్స్యాసి, తేజోమూర్తి, వివేకానందుడి దివ్యాకర్షణకు అమెరికాలో అందరూ శిరసు వంచారు. ఓ కోటీశ్వరురాలైన యువతి స్వామిజీమిమ్మల్ని వివాహమాడాలని వుంది అని అడిగింది. ఎందుకమ్మా నీకా అలోచన అన్నారు స్వామి. 'మీ దేశభక్తి, శక్తి, తెలివితేటలు, మీ వాగ్ధాటి, ధైర్యసాహసాలు, తేజస్సూ అపారం. కాబట్టి మిమ్మల్ని పెళ్ళాడితే మీ వంటి గొప్ప పుత్రునికి తల్లిని కావచ్చు. మీ వంటి కొడుకు నాకు కావాలి' అని సమాధానం ఇచ్చింది. అందుకు స్వామీజీ 'అమ్మ నా వంటి పుత్రునికి నీవు జన్మనిచ్చి వాడు నా అంతటి వాడు కావాలంటే మీకు ఇంకా 30 ఏళ్ళు పడుతుంది. ఈలోగా ఏమైనా జరిగితే నీ కోరిక తీరకపోవచ్చు. అంత ప్రయాస ఎందుకమ్మా నేనే నీ ఎదురుగా ఉన్నాను, ఇక్కడే, ఇప్పుడే నన్ను నీ పుత్రునిగా స్వీకరించు తల్లీ' అన్నాడు. వెంటనే అ యువతి తన తప్పు తెలుసుకుని మన్నించమని వేడుకుంది...
అది స్వామి వివేకానందుడంటే
కామెంట్ను పోస్ట్ చేయండి