సంక్రాంతి విధులు -మహిమలు
కాలమును రాత్రింబవళ్ళుగా విభజించే సూర్యచంద్రుల గమనంపై మానవ జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అంతే కాక సంవత్సరంలో సూర్యుడు ఒక రాశినుండి మరొక రాశిలోనికి ప్రతినెల మారుతుంటాడు. ఇలా మారుటనే సంక్రమణమంటారు. ప్రవేశించిన ప్రతిరాశిలోను సూర్యుడొక మాసముంటాడు. కుంభరాశినుండి వృశ్చికరాశిక్ వరకు పదకొండు మాసాలుండి పన్నెండో రాశియైన మకరమున ప్రవేశించుట మహా సంక్రమణమని, సంక్రాంతి అని చెప్పబడేది ఈ పుష్యమాసంలోని సంక్రమణమే.
దీనినే ’ఉత్తరాయణ పుణ్యకాలమని’ అంటారు. సంవత్సరం ఉత్తరాయణమని, దక్షిణాయమని రెండుగా విభజించబడితే ధనుర్మాసాంతమున దక్షిణాయనం పూర్తై, నేటినుండి ఉత్తరాయణం ఆరంభమవుతుంది.
కనుక మకర సంక్రమణం జరిగే ఈరోజున ఉత్తరాయణ పుణ్యకాలమని చెప్తారు. ఈవిధంగా సంక్రమణద్వయం ఈనాడేర్పడుట వలన మహా సంక్రమణమైనది. ఇది చాలా శక్తివంతమైనది.
మహాసంక్రమణం శక్తిమంతం: సూర్యుడు ధుస్సు ప్రవేశించినప్పటి నుండి గృహాలు లక్ష్మీకళతో శోభిల్లుతూంటాయి. గోమయంతో శుద్ధి చేయబడిన ప్రాంగణాలు రంగవల్లులతో, అందు గొబ్బెమ్మలతో ప్రకాశిస్తుంటాయి. గృహద్వారాలు మామిడాకుల తోరణాలతో, రంగురంగుల బంతి పువ్వులతో, గపలు పసుపు, కుంకు,అలతో కళకళలాడుతూంటాయి. ఈవిధమైన లక్ష్మీశోభ వలన గృహాలలోని వారంతా సుఖశాంతులతో, ఆనందానుభూతి నొందుతూ శక్తిమంతులవుతున్నారు. ఈ ధనుర్మాస మనేది మార్గశిర మాసం, హేమంత ఋతువులో వచ్చేది. కనుక ఇది నరులకు పుష్టిని కలుగజేసే మాసం. తరువాత వచ్చే పుష్యమాసమింకను పుష్టిదాయకం.
’పుష్యమీ’ అనే ఈ పదమునకు అనేక అర్థాలున్నాయి. అవి-కోరికను వృద్ధి పొందించునది. దీనియందు ప్రయోజనములు సిద్ధిస్తుంది. కోరికను సాధించునది, దీనియందు కార్యసిద్ధి కొరకు సంతోషిస్తారు, ప్రకాశించునది.
స్నాన దాన యజ్ఞాలు: మకర సంక్రమణ కాలమున స్నానం ముఖ్యంగా చేయాలని చేయనివాడు ఏడుజన్మల వరకు రోగిగా, నిర్ధనుడుగా అగునని, అలాగే చేసిన దానధర్మాల ఫలితంగా ప్రతి జన్మయందు అటువంటి ద్రవ్యాు, కర్మలను సూర్యానుగ్రహం వలన తిరిగి పొందుతామని ధర్మసింధువచనం.
మకర సంక్రమణ సమయమున తిలధేను దానం, తిలతైలంతో శివాలయమున దీపదానం, తిలలు బియ్యం కలిపి శివారాధన, నల్లనువ్వులతో అభ్యంగన స్నానం, తిలదానం, తిలహోమం, నల్లనువ్వులతో పితృతర్పణం చేయవలెనని చెప్పబడినది.
సంపత్సమృద్ధివలన సజ్జనులు కల్మషము లేనివారై దీని అనుభవించుటకు ముందు ఆగ్రయణేష్టిని నిర్వహించి పితృదేవతల నారాధించి పాపరహితులవుతారని వాల్మీకి రామాయణమున చెప్పబడింది. అగ్నావైవేష్టి’ అనే ఈ యజ్ఞనిర్వహణవలన నేత్ర సంబంధ రోగములుండవని చెప్పబడింది.
ఈ యజ్ఞ నిర్వహణలోఎద్దులచే దున్నబడి పండించి ధాన్యము నుండి వచ్చిన బియ్యమును ఆవునేతితో వండి, ఆ చరువును (అన్నమును) అగ్ని, విష్ణువులకు హోమరూపంగా అందించాలి. ఇక్కడ వండబడిన అన్నమునకు మూలభూతములైన ఆజ్యమునకు, తండులములకు ఉత్పాదకములైన గోవృషభములు మిథునంగా వర్ణించబడ్డాయి. ఈ మిథున మూలకంగా నిష్పన్నమైన నేతిని, బియ్యమును గోవృషభముల రేతస్సుగా వర్ణించి ఆ రేతోద్వయ సమ్మేళన రూపమైన హోమ ద్రవ్య ప్రభావముచే నేత్ర రోగములకు ఆస్కారముండదని మంత్రబోధ.
ఇచ్చట గోవనగా లక్ష్మీ స్వరూపం. వృషభమనగా ధర్మం, నారాయణ స్వరూపం. అంటే మనకు ప్రాణాధారమైన అన్నము బ్రహ్మస్వరూపం. ఇలా బ్రహ్మ స్వరూపమగు సస్య సమృద్ధిని పుష్యమాసమందిస్తున్నది. "పృథివీ సస్యశాలినీ" అని రామాయణ వచనం.
మన సంపత్సమృద్ధికి కారకుడైన భగవంతుని పట్ల, వృక్షములు వలె, కృతజ్ఞత తప్పక చూపాలి. గర్వముండరాదు. కాబట్టి ఈ మకర సంక్రమణ మయంలో మనం నిర్వర్తించవలసిన విధివిధానమును తప్పక ఆచరించి భగవత్ప్రసాదమైన ఆహారమును మనం అనుభవిస్తే రోగ రహితులమై శక్తివంతులమై ఆనందంగా జీవితమును అనుభవిస్తాం.
ఆంగ్లమాసం ప్రకారం సంక్రాంతి జనవరి నెలలో 14 లేక 15 తేదీలలో సూర్యగమనము ననుసరించి వస్తుంది. పుష్యమాసమున వచ్చు సంక్రాంతి మూడురోజుల పండుగలాగ జరుపుకొంటారు. మొదటిరోజున ప్రాతఃకాలమున భోగిమంటలతో ఈ పండుగ నారంభిస్తారు. ఆడపిల్లలు ఇళ్ళలో బొమ్మలకొలువులు ఏర్పరుస్తారు. ముత్తయిదువులనాహ్వానించి వారి ఆశీర్వాదమును పొందుతారు. రెండవరోజు ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ రోజున పైన చెప్పిన దానాదులను ఆచరిస్తారు. మూడవరోజు కనుమను పశువుల పండుగగా జరుపుకొనుట ఆచారంగా వస్తున్నది.
ఒక బీజమును నాటినపుడు అందుండి మొలక బయటకు వస్తుంది. అప్పటినుండి దానికవసరమగు రక్షణను నాటిన వారు కల్పించగా, అది ఏపుగా పెరిగి మనకవసరమైన పుష్పాలను గాని, కాయలు గాని ఇవ్వగలదు. అదిచ్చిన ఫలితమును చూచి మన కృషి ఫలించినదనే సంతృప్తి తప్పక ఉంటుంది కదా. అలాగే దంపతులు కూడ పుట్టిన పిల్లలను వారి పోషణకు తగినవి సమకూర్చుతూ జాతకర్మాదులను తీర్వహించి విద్యాబుద్ధులను నేర్పి పెంచినపుడు పైన చెప్పినట్లు తీగలు, చెట్లకు జ్వలె వారున పెంచిన వారికా ఆనందమును, తృప్తిని కలిగించాలి కదా. ఏ చెట్టుకాని, తీగకాని, తగిన శక్తిని గ్రహించిన తరువాత నా జీవితం నాదే అన్నట్లుండదు. పెంచిన వారి పట్ల కృతజ్ఞతతో ముందు చెప్పినట్లు కృతజ్ఞతా భావంతో తలలు వంచి అందుబాటులో ఉంటాయి. అలాగే పిల్లలు కూడా పెంచిన వారిపట్ల కృతజ్ఞతా భావంతో, వినయవిధేయలతో ఉండాలి.
ఇది అలవడాలంటే శాస్త్రాలలో చెప్పినట్ు వానిపై నమ్మకముండి, వాటిలో చెప్పినట్లు ఆయా కాలాలకు సంబంధించిన విధులను నిర్వర్తించాలి. తన కుటుంబానికి సుఖశాంతులను కలుగజేయాలి.
ఒకవేళ ఇవన్నీ చేయలేకపోయిన దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రమున చెప్పినట్లు నడచుకోవాలి. నాకే మంత్ర యంత్రములు తెలియవు. నిన్ను స్తుతించటం తెలియదు. ఆహ్వాన ధ్యానములును తెలియవు. నీ స్తుతి కథలు తెలియవు. నీ ముద్రలు తెలియవు. వ్యాకులతతో ఉన్నప్పుడు విలపించటం తెలియదు. కానీ మాతా! క్లేశమును హరింపజేసే నీ అనుసరణం మాత్రమే నేనెరుగుదును-అనాలి.
కాబట్టి నీవేమి చేయలేని స్థిిలో నున్నప్పుడు కనీసం ఆ దేవిననుసరించుటయైనా చేయాలి.
అలాగే ఈ మకరసంక్రమణ సమయమందు ఆచరించవలసిన వానిని మన పూర్వీకుల ఆచరణ చూచియైనా నేర్చుకొని వానినాచరింప ప్రయత్నమునైనా చేయాలి. దీనిద్వారా శాంతి సౌభాగ్యములు, లక్ష్మీ శోభ గృహమున శాశ్వతముగ నుండునట్లు చూడాలి. ఇది మన బాధ్యత.
లక్ష్మీర్దివ్యైర్గజేన్ద్రైః మమ వసతు గృహే సర్వ మాంగళ్య యుక్తా! అనే దానిని మరువరాదు.
కామెంట్ను పోస్ట్ చేయండి