నవీనము

6, జనవరి 2016, బుధవారం

జై హింద్.జై జవాన్. భారత్ మాతాకీ జై.




 ఆరుగురు  పిచ్చి కుక్కలను వేటాడటానికి 
ఆరు గురు సింహాల్లాంటి సిపాయీలు అసువులు బాసారు. 
భారత్ ని భయపట్టాలన్న కుట్రలను ధీటుగా తిప్పికొట్టారు.
అయితే విమానమొ,హెలికాప్టరో ఐతే మళ్ళి సంపాదిచుకోవచ్చు.
ఇంతటి సాహసవీరులను మళ్ళీ తెచ్చేదెలా!
అనితర సాధ్యమైన తెగువను చూపి జాతికి ఆదర్శంగా నిలిచిన
ఓ! భరతమాత వీరపుత్రలారా మీ పాదాలకు వేలవేల నమస్సులు.
మీరు విడిచిన ఊపిరులే ప్రాణవాయులుగా అనుక్షణం రెపరెపలాడుతుంది మువ్వన్నెల జెండా. ప్రతి భారతీయ హృదయం పలుకుతుంది మీ త్యాగానికి సలాం. మిత్రులారా ! 
పనికిరాని పిచ్చి వార్తలు అనేకం పంచుకొనే మనం దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న వీరజవానులను గురించి తలుచుకోక పోవటం చాలా బాధాకరం.
వారిచ్చిన భిక్ష ఈ మన ప్రశాంత జీవితాలు.వారే సిసలైన భరతమాత బిడ్డలు.
ఒక్కసారి వారి అత్మలకై,వారి కుటుంబాలకై ప్రార్థించు్దాం. 
జై హింద్.జై జవాన్. భారత్ మాతాకీ జై.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy