నవీనము

25, జనవరి 2016, సోమవారం

ఎవరి మేలు వారే చూసుకోవాలి.




ఉ. భూపతి కాత్మబుద్ధి మదిఁ బుట్టనిచోటఁ బ్రధాను లెంత ప్ర
జ్ఞాపరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము కార్యదక్షులై
యోపిన ద్రోణభీష్మకృపయోధు లనేకులు గూడి కౌరవ
క్ష్మాపతి కార్యమేమయినఁ జాలిరె చేయఁగ వారు భాస్కరా.

భావం - ప్రభువు స్వయంగా తన మంచి చెడ్డల గురించి ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకోలేనప్పుడు ఎంతమంది నిపుణులైన మంత్రులున్నా, మేలు జరగదు. దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వంటి తెలివైనవారు ఎందరున్నా, ఆలోచనలేక, తన హితం గురించి ఆలోచించని దుర్యోధనుడిని ఎవరైనా బాగు చేయగలిగారా? ఎవరి మేలు వారే చూసుకోవాలి.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy