నవీనము

29, ఫిబ్రవరి 2016, సోమవారం

ఓ పరమేశ్వరా! సాలెపురుగు ఏ వేదం చదివింది?





శా. ఏ వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్ సూచెఁదా
నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చుదువులయ్యా? కావు; నీ పాద సం
సేవాసక్తియె కాక జంతు తతికిన్‌ శ్రీ కాళహస్తీశ్వరా!

భావం - ఓ పరమేశ్వరా! సాలెపురుగు ఏ వేదం చదివింది? పాము ఏ శాస్త్రములు అభ్యసించింది. ఏనుగు ఏమి నేర్చుకుంది? బోయవాడైన తిన్నడు ఏ మంత్రం పఠించాడు? వీరందరు మోక్షం కోసం నిన్ను సేవించారే తప్ప వారికేమీ తెలియదు. నీ మోక్షాన్ని పొందటానికి చదువులు కావాలా? కాదు, జీవకోటి అంతా మోక్షం పొందటానికి నీ భక్తి ఒక్కటే చాలు. నీ పాద సేవ చాలు. చదువుల వల్ల మోక్షం సిద్ధించదు, నీ యందు నిశ్చల భక్తి వల్లనే సిద్ధిస్తుంది.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy