గోవు సకలదేవతా స్వరూపం . భూమి పై మానవుల తల్లి. సకలదోషాలను పరిహరించి శుభాలను ప్రాప్తింపచేస్తుంది గోసేవ. గోపూజ. ఈమధ్యకాలంలో కాస్త గోవులపట్ల శ్రధ్ధాశక్తులు పెరుగుతున్నాయి ఆస్తికలోకంలో. ఏగుడిలో చూసినా గోపూజలు నిర్వహించబడుతున్నాయి. కొన్నిచోట్ల సామూహికంగా ఒక ఉత్సవంలా జరుపుతున్నారు. మంచిదే. కానీ ఒక్కరోజు గుడికి వచ్చి అక్కడ అట్టహాసంగా వివిధ పూజాద్రవ్యాలతో పూజచెసేవారు మాత్రం నాలుగు అరటిపండ్లన్నా పట్టుకురారు. పాపం ఆ గోవులు మనం పసుపుకుంకుమలతో అలంకారాలు చేస్తుంటే ఏవైనా తినటానికి పెట్టమని ఎగబడుతుంటాయి . వాటిని అదిలించైనా మన పద్దతి ప్రకారం పూజ జరుపుతాము గాని వాటి ఆకలి తీర్చటానికి ప్రాధాన్యత ఇవ్వము.
మీరు గోపూజకు సిద్దమయితే పూజాద్రవ్యాలు వారకార్ధం తీసుకెళ్లండి. పచ్చిగడ్డి ఎక్కువగా కొని తీసుకువెళ్ళండి. ఆగోవులకు కడుపునిండా పెట్టండి.
చేయగలిగితే మీపిల్లలకు చిరుతిళ్ళు కొనుక్కోవటానిఇస్తున్నట్లుగా రోజుకో రెండు మూడు రూపాయలు ఒక హుండిలో వేసి ఆడబ్బుతో గోశాలలలో ఉన్న గోవులకు గ్రాసం కొని ఇవ్వండి. దాణా అయినా కొని ఇవ్వవచ్చు.
మీరు కడుపునింపిన ప్రతిసారీ తృప్తిగా దీవిస్తుంది గోమాత, అది మీకుటుంబానికి మీపిల్లల భవిష్యత్తుకు శ్రీరామ రక్ష

కామెంట్ను పోస్ట్ చేయండి